Published on Oct 17, 2024
Current Affairs
బీమా సుగమ్‌ ఇండియా ఫెడరేషన్‌ ఎండీగా ప్రసూన్‌ సిక్దర్‌
బీమా సుగమ్‌ ఇండియా ఫెడరేషన్‌ ఎండీగా ప్రసూన్‌ సిక్దర్‌

బీమా సుగమ్‌ ఇండియా ఫెడరేషన్‌ తొలి మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా ప్రసూన్‌ సిక్దర్‌ 2024, అక్టోబరు 15న ఎంపికయ్యారు. ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రసూన్‌ మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు ఎండీ, సీఈఓగా ఉన్నారు. బీమా రంగంలో సిక్దర్‌కు 25ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తీసుకొచ్చిన వినూత్న ఆవిష్కరణ బీమా సుగమ్‌.