Published on Apr 8, 2025
Current Affairs
బీఈఎల్‌కు రూ.2,385 కోట్ల ఆర్డర్‌
బీఈఎల్‌కు రూ.2,385 కోట్ల ఆర్డర్‌

రక్షణ మంత్రిత్వశాఖ 2025, ఏప్రిల్‌ 7న బెంగళూరు కేంద్రంగా పనిచేసే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో సుమారు రూ.2,385 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

దీని ప్రకారం స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ (ఈడబ్ల్యూ) సూట్స్, భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడిఫికేషన్‌ కిట్స్‌..వాటి ఇన్‌స్టాలేషన్‌ను అందించాలి.

కీలకమైన ఈ సూట్‌తో ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్‌ పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపింది.