దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ 2024, అక్టోబరు 10న విడుదల చేసింది. ముకేశ్ అంబానీ 119.5 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ గత 12 నెలల్లో 27.5 బి.డాలర్లు పెరింది. గౌతమ్ అదానీ 116 బి.డా.తో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 12 నెలల్లో మాత్రం 48 బి.డా. పెరిగింది. ఈ జాబితాలో సావిత్రి జిందాల్ (43.7 బి.డా.), శివ్ నాడార్ (40.2 బి.డా.), దిలీప్ సంఘ్వి (32.4 బి.డా.) వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు.