భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా అందించే ‘ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్’ అవార్డును 2024 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అందుకున్నారు. పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. 2024, అక్టోబరు 1న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.