Published on Oct 2, 2024
Current Affairs
‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పబ్లిషింగ్‌’ అవార్డు
‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పబ్లిషింగ్‌’ అవార్డు

భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా అందించే ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పబ్లిషింగ్‌’ అవార్డును 2024 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అందుకున్నారు. పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. 2024, అక్టోబరు 1న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి ఆయనకు అవార్డు  ప్రదానం చేశారు.