ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడి ఫ్యూజియన్ ప్రావిన్సులో బయటపడిన ఆ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.
పక్షి జాతుల పుట్టుక, వాటి పరిణామ క్రమం తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు 2025, ఫిబ్రవరి 13న వెల్లడించారు.
బామినోర్నిస్ జెంగెన్సిస్ అని వ్యవహరిస్తున్న ఈ పక్షి శరీర నిర్మాణం ఇంచుమించుగా ఆధునిక విహంగాల మాదిరిగానే ఉంది.
తాజా పరిశోధనల ప్రకారం 17.2 కోట్ల నుంచి 16.4 కోట్ల ఏళ్ల కంటే ముందే పక్షులు పరిణామం చెందాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.