ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్)గా 1994 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పీవీ చలపతిరావు 2025, ఆగస్టు 31న నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఏకే నాయక్ పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. 2028 జూన్ నెలాఖరు వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఎర్రచందనం, ప్రొడక్షన్ విభాగం పీసీసీఎఫ్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.