ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) నోటిఫికేషన్ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీన్నీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026)
కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ టెక్నా్లజీ.
అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, బీపీఈడీ తదితరాల ఉత్తీర్ణత ఉండాలి.
పరీక్ష ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీలకు రూ.750. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.650.
ఆలస్య రుసుము రూ.1,000తో చివరి తేదీ: 13-03-2026 .
ఆలస్య రుసుము రూ.2,000లతో చివరి తేదీ: 16-03-2026
ఆలస్య రుసుము రూ.4,000లతో చివరి తేదీ: 19-03-2026
ఆలస్య రుసుము రూ.10,000లతో చివరి తేదీ: 23-03-2026.
దరఖాస్తు కరెక్షన్ విండో: 25.03.2026.
డౌన్లోడ్ హాల్ టికెట్: 21-04-2026 నుంచి.
ప్రవేశ పరీక్ష: మే 05 నుంచి 11 వరకు.
Website:https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage