పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్ 2025, సెప్టెంబరు 12న మద్దతు తెలిపింది.
193 సభ్యులు కలిగిన సర్వసభ్య సభలో భారత్తో సహా 142 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.
10 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతోపాటు ఇజ్రాయెల్, పాలస్తీనాలు తమ మధ్య ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న న్యూయార్క్ డిక్లరేషన్ను తీర్మానం సమర్థించింది.