కేంద్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 23న ‘‘ప్రహార్’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని ప్రారంభించింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు, వారికి ఆర్థిక సాయం చేసేవారికి, మద్దతు దారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని హోంశాఖ పేర్కొంది.
దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి ఏడు స్తంభాల్లాంటి అంశాలను నిర్దేశించారు.