Published on Dec 9, 2025
Current Affairs
‘ప్రసాద్‌’ పునర్వ్యవస్థీకరణ
‘ప్రసాద్‌’ పునర్వ్యవస్థీకరణ
  • దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పిలిగ్రిమేజ్‌ రెజువనేషన్‌ అండ్‌ స్పిరిట్యువల్‌ అగ్‌మెంటేషన్‌ డ్రైవ్‌ (ప్రసాద్‌) పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 10 ఏళ్లలో ఈ పథకం కింద 54 ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపింది. 2025, డిసెంబరు 8న సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ శెఖావత్‌ ఈ విషయాలు వెల్లడించారు. 
  • 2014లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.