Published on Jun 5, 2025
Current Affairs
పరమ విశిష్ట సేవా పతకం
పరమ విశిష్ట సేవా పతకం

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పరమ విశిష్ట సేవా పతకాన్ని వైస్‌ అడ్మిరల్, సదరన్‌ నేవల్‌ కమాండ్‌ ఇన్‌ చీఫ్‌ వెన్నం శ్రీనివాస్‌ 2025, జూన్‌ 4న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈయన భారత నౌకాదళానికి 38 ఏళ్లుగా అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ పతకంతో గౌరవించింది.