- తెలంగాణలో రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు దిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్) అధ్యయంన వెల్లడించింది. దేశంలో పురుగుమందులను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండగా... ఎరువుల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. భారత వ్యవసాయ స్థితిగతులపై నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇందులోని ముఖ్యాంశాలు..
- దేశంలో పురుగుమందుల సగటు వినియోగం హెక్టారుకు 500 గ్రాములు ఉండగా... తెలంగాణలో 900 గ్రాములను వాడుతున్నారు.
- ఎరువుల వినియోగం జాతీయ సగటు హెక్టారుకు 136.2 కిలోలు కాగా తెలంగాణలో 315 కిలోల వినియోగిస్తున్నారు.