ఏఐ సాంకేతికతతో రూపొందించిన ‘పురమిత్ర’ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025, మార్చి 15న తణుకులో ప్రారంభించారు.
ఈ యాప్ పట్టణ సేవలను ఫోన్లోనే అందించి, పౌరులకు స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ అనుభవాన్ని అందిస్తుంది.
నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక, ఇంజినీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులను ఈ యాప్లో అందించవచ్చు.