ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ (రాజేంద్రనగర్, సైఫాబాద్), జగిత్యాల, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఎంఎస్సీ(అగ్రికల్చర్): 108 సీట్లు
2. ఎంబీఏ(అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్): 17 సీట్లు
3. ఎంటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్): 06 సీట్లు
4. ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్): 17 సీట్లు
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఐసీఏఆర్- ఏఐఈఈఏ(పీజీ) 2024 ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31-12-2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఐసీఏఆర్- ఏఐఈఈఏ(పీజీ) 2024 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 17.10.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.10.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 19.10.2024.
Website:https://www.pjtsau.edu.in/
Apply online:https://www.pjtsau.edu.in/pjtau-pg-masters-application-2024-25.html