Published on Feb 24, 2025
Current Affairs
పరంపరాగత్‌ అవార్డు
పరంపరాగత్‌ అవార్డు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండల నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు పరంపరాగత్‌ అవార్డు లభించింది.

2025, ఫిబ్రవరి 23న దిల్లీలో కేంద్ర విద్యుత్‌ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు.

దిల్లీలో ఫిబ్రవరి 7 నుంచి 23 వరకు 38వ సూరజ్‌ కుండ్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ మేళా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1300 మంది కళాకారులు పాల్గొనగా, ఆరుగురిని అవార్డుకు ఎంపిక చేశారు. 

ప్రథమ స్థానంలో నిలిచిన శివమ్మకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.11 వేల నగదు బహుమతి అందజేశారు.