ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మీనాక్షి, జైస్మీన్ పసిడి పతకాలు నెగ్గారు. 2025, సెప్టెంబరు 14న లివర్పుల్లో జరిగిన 57 కేజీల తుదిపోరులో జైస్మీన్ 4-1తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా జెరెమెటా (పోలెండ్)ను ఓడించింది. 48 కేజీల ఫైనల్లో మీనాక్షి 4-1తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ నజమ్ కిజైబి (కజకిస్థాన్)పై నెగ్గింది.