Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది.
2025, జూన్ 14న లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది.
282 పరుగుల ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 213/2తో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన.
మార్క్రమ్కు (136; 207 బంతుల్లో 14×4) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఐసీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం పదిహేనళ్లలో ఇదే తొలిసారి.
చివరగా 2010 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయంపాలైంది.
గత యాభై ఏళ్లలో పద్నాలుగుసార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్