దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్-100లో ఒకటిగా విశాఖ పోర్ట్ స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 2026, జనవరి 10న పేర్కొన్నారు. విశాఖలో రూ.305 కోట్లతో దేశంలోనే అత్యాధునిక షిప్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
విశాఖలోని సాగరమాల కన్వెన్షన్లో విశాఖ పోర్ట్ అథారిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు సోనోవాల్ శంకుస్థాపన చేశారు. ‘మారిటైం ఇండియా విజన్ 2030’, ‘మారిటైం అమృత్కాల్ విజన్ 2047’ రెండూ భారత నౌకాయాన అభివృద్ధికి ప్రకటించారన్నారు.