పోషకాహార లోపం, శిశు మరణాల ఆధారంగా ఆకలి బాధను అంచనా వేసే ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ) భారత్ను ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది. 127 దేశాలకు జీహెచ్ఐ ర్యాంకులు ఇవ్వగా 27.3 స్కోర్తో భారత్ 105వ స్థానంలో నిలిచింది. 2024 జీహెచ్ఐ నివేదికను కన్సర్న్ వరల్డ్వైడ్, వెల్త్హంగర్హిల్ఫే ఇటీవల ప్రచురించాయి.
భారత్ జనాభాలో 13.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.5 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని, 18.7 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరని ఈ నివేదిక వెల్లడించింది.