ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది. ప్రపంచ అవినీతి సూచీ 2024లో 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకిందని పేర్కొంది.
విభిన్న కసరత్తులు, నిపుణుల విశ్లేషణలు, సర్వేల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. ఇందులో 0 పాయింట్లు సాధించిన దేశం పూర్తి అవినీతిమయమని, 100 పాయింట్లు పొందిన దేశంలో అవినీతి లేనేలేదని అర్థం.
డెన్మార్క్ 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రభాగాన నిలిచింది. తదుపరి రెండు స్థానాలు ఫిన్లాండ్, సింగపూర్లకు దక్కాయి.