Published on Oct 15, 2025
Current Affairs
ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ (పారా) రన్నింగ్‌ పోటీల్లో జీవాంజి దీప్తి రెండో బంగారు పతకం నెగ్గింది.

ప్రతిష్టాత్మక పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

2025, అక్టోబరు 14న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన టీ20 మహిళల 200 మీటర్ల పరుగును 24.62 సెకన్లలో పూర్తిచేసిన దీప్తి అగ్రస్థానం కైవసం చేసుకుంది.

అక్టోబరు 12న జరిగిన 400 మీటర్ల పరుగులోనూ దీప్తి పసిడి పతకం దక్కించుకుంది.