ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్నకు భువనేశ్వర్ ఆతిథ్యమివ్వనుంది. 2026, మార్చి 19న పోలెండ్లో సమావేశమైన ప్రపంచ అథ్లెటిక్స్ పాలకవర్గం.. ప్రతిష్ఠాత్మక పోటీల ఆతిథ్య హక్కుల్ని భారత్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
భువనేశ్వర్లోని కళింగ స్టేడియం సముదాయంలోని అత్యాధునిక ఇండోర్ కేంద్రాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ బృందం ఇప్పటికే పరిశీలించింది. మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్లో పురుషులు, మహిళలకు 13 ఈవెంట్ల చొప్పున మొత్తం 26 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.