Published on Mar 5, 2025
Current Affairs
ప్రిన్సెస్‌ ఆస్ట్రిడ్‌తో మోదీ భేటీ
ప్రిన్సెస్‌ ఆస్ట్రిడ్‌తో మోదీ భేటీ

బెల్జియం రాకుమారి ప్రిన్సెస్‌ ఆస్ట్రిడ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025, మార్చి 4న సమావేశమయ్యారు.

వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంతో రెండు దేశాల ప్రజలకూ అంతులేని అవకాశాలు పెంపొందాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదల, పెట్టుబడుల ద్వారా సహకారం అందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార మిషన్‌లో భాగంగా బెల్జియం రాకుమారి భారత్‌ సందర్శనకు వచ్చారు.