జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఆగస్టు 29న టోక్యోలో ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబతో భేటీ అయ్యారు. సాంకేతికత, కృత్రిమ మేధ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికం, ఔషధాలకు సంబంధించి 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. 50,000 మంది నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులను అయిదేళ్లలో భారత్ నుంచి జపాన్కు పంపించడం వీటిలో ఒకటి. జపాన్ సిగ్నల్ వ్యవస్థపై పనిచేసే ‘షింకన్సేన్ ఇ 10 సీరీస్’ రైళ్లను 2030 నాటికి భారత్కు ఇస్తామని జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.