కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటాయి. దీంతో పాటు కేంద్ర సచివాలయ భవనాలైన కర్తవ్య భవన్-1, కర్తవ్య భవన్-2లనూ ఆయన ప్రారంభించారు.
కర్తవ్య భవన్లు 1, 2లలో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయశాఖలతోపాటు పలు శాఖల కార్యాలయాలుంటాయి. ఈ రెండు భవనాలు డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి.
1921 నుంచీ దేశంలో అధికార కేంద్రాలుగా ఉన్న చారిత్రక సౌత్బ్లాక్, నార్త్బ్లాక్ భవనాలను మ్యూజియంగా మారుస్తామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.100 ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు.