మలేసియా పర్యటనలో భాగంగా 2026, ఫిబ్రవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ పుత్రజయ నగరం వేదికగా ఈ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీ కండక్టర్లు సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి 11 ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్, మలేసియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. రెండు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.