మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక తెలిపింది. ‘రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్: 1960-61 టు 2023-24’ పేరుతో కౌన్సిల్ సభ్యులు సంజీవ్సన్యాల్, ఆకాంక్ష అరోడాలు రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
* స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9%.
* జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1960-61లో 7.7% ఉండగా, 2023-24 నాటికి 9.7 శాతానికి చేరింది. 2010-11లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 2023-24 నాటికి ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9 శాతానికి చేరాయి.
* జాతీయసగటుతో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% అధికంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 131.6% అధికంగా ఉంది.