ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పార్థ్ రాకేశ్ మానె రెండు స్వర్ణ పతకాలు నెగ్గాడు. 2024, అక్టోబరు 1న పెరూలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో పార్థ్ 250.7- 250తో హువాంగ్ లివాన్లిన్ (చైనా)పై నెగ్గి ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు.
* పార్థ్, అభినవ్ షా, అజయ్ మలిక్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. భారత్ (1883.5), అమెరికా (1877.6), జర్మనీ (1873.9) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.