Published on Oct 2, 2024
Current Affairs
పార్థ్‌కు రెండు స్వర్ణాలు
పార్థ్‌కు రెండు స్వర్ణాలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పార్థ్‌ రాకేశ్‌ మానె రెండు స్వర్ణ పతకాలు నెగ్గాడు. 2024, అక్టోబరు 1న పెరూలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో పార్థ్‌ 250.7- 250తో హువాంగ్‌ లివాన్లిన్‌ (చైనా)పై నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 

* పార్థ్, అభినవ్‌ షా, అజయ్‌ మలిక్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. భారత్‌ (1883.5), అమెరికా (1877.6), జర్మనీ (1873.9) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.