దేశ వైద్య సాంకేతికత రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనలు, పరికరాల తయారీని వేగవంతం చేయడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ‘మెడ్టెక్ క్యాపిటల్’ నిధి అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (ఏఎంటీజడ్), మెడ్ ఆర్థా క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ నిధిని 2026, మార్చి 15న ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు.