ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2024-25 ఇదే సమయంలోని పన్ను వసూళ్లతో పోలిస్తే ఇవి 9.4% అధికం. కార్పొరేట్ పన్ను వసూళ్లు అధికంగా నమోదవడం ఇందుకు దోహదం చేసింది.
ఆదాయ పన్ను విభాగం 2026, ఫిబ్రవరి 11న విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 14.51% వృద్ధితో రూ.8.9 లక్షల కోట్లకు చేరుకోగా, నాన్-కార్పొరేట్ (వ్యక్తిగత, హిందు అవిభాజ్య కుటుంబాలు సహా) విభాగం నుంచి 5.91% అధికంగా రూ.10.03 లక్షల కోట్లకు చేరాయి. పన్ను రిఫండ్ల జారీ 18.82% తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమైంది.