Published on Sep 19, 2024
Current Affairs
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.95 లక్షల కోట్లు
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.95 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 17 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.12% పెరిగి రూ.9.95 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్‌లు 56.49% అధికమై రూ.2.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

* నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 19% వృద్ధితో రూ.5.15 లక్షల కోట్లకు పెరిగాయి. సెక్యూరిటీస్‌ లావాదేవీ పన్ను ఆదాయాలు రూ.26,154 కోట్లుగా ఉన్నాయి.