Published on Oct 17, 2024
Current Affairs
ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం
ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ఎంక్యూ-9బీ ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై భారత్‌ 2024, అక్టోబరు 15న సంతకం చేసింది. దీని కింద అమెరికా ఆయుధ దిగ్గజం ‘జనరల్‌ అటామిక్స్‌’ నుంచి మన దేశం మొత్తం 31 డ్రోన్లను కొనుగోలు చేస్తుంది. ఇందుకు సుమారు 400 కోట్ల డాలర్లు (రూ.33,600 కోట్ల)ను వెచ్చించనుంది. 

డ్రోన్ల మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కూడా రక్షణ శాఖకు, జనరల్‌ అటామిక్స్‌కు మధ్య విడిగా ఒక ఒప్పందం కుదిరింది.