Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 31, 2026
Current Affairs
పాముకాటు మరణాలు దక్షిణాదిలోనే అధికం
పాముకాటు మరణాలు దక్షిణాదిలోనే అధికం

పాముకాటు మరణాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ 2026, మార్చి 30న లోక్‌సభలో తెలిపారు. 2023-25 మధ్య దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పాముకాటుకు గురై 984 మంది చనిపోగా అందులో 431 మంది (43.80%) కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 277 మంది, తమిళనాడులో 95 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 59 మంది ఉన్నారు. ఏపీలో 2024లో అత్యధికంగా 41 మంది పాముకాటుకు బలయ్యారు.