కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం మల్లికార్జున్రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఫెలో ఫార్మర్, ఇన్నోవేటివ్ ఫార్మర్ విభాగాల్లో పురస్కారాలు అందిస్తుంది.
ఈ ఏడాది (2025) ఫెలో ఫార్మర్ పురస్కార విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేయగా, అందులో దక్షిణ భారతదేశం నుంచి మల్లికార్జున్రెడ్డి మాత్రమే ఉన్నారు.