న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 188
వివరాలు:
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్: నార్తెర్న్ రీజియన్-I (హరియాణా; యూపీ, రాజస్థాన్), వెస్ట్రన్ రీజియన్-I (మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్), వెస్ట్రన్ రీజియన్-II- (మధ్య ప్రదేశ్, గుజరాత్), సదరన్ రీజియన్-II (కర్ణాటక, తమిళనాడు).
ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ పోస్టులు
విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్.
అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.
నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13,500; డిప్లొమా ట్రేడ్ రూ.15,000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్ రూ.17,500.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.03.2026.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11.03.2026.
Website:https://www.powergrid.in/en/