పంజాబ్ సింథ్ బ్యాంక్ రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ మేనేజర్, అగ్రికల్చర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 190
వివరాలు:
1. క్రెడిట్ మేనేజర్: 130
2. అగ్రికల్చర్ మేనేజర్: 60
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎఫ్ఎంఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.64,820 - రూ.93,960.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 10.