పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), దిల్లీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 5,138
వివరాలు:
రాష్ట్రీవారీ ఖాళీలు:
1. తెలంగాణ: 69
2. ఆంధ్రప్రదేశ్: 56
3. తమిళనాడు: 121
4. కర్ణాటక: 64
5. కేరళ: 83
6. ఒడిశా: 142
7. పాండిచ్చెరి: 02
మిగతా పోస్టుల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ. 12,300 - రూ.15,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600 నుంచి రూ.800. పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్లకు అభ్యర్థులకు రూ.200.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 8.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 24.