పీఎం కుసుమ్ కాంపోనెంట్ సీ కింద (గ్రిడ్కు కనెక్ట్ చేసిన సౌర విద్యుత్తు పంప్సెట్లు) ఆంధ్రప్రదేశ్లోని 21 జిల్లాలకు 1,162.80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్సెట్లు మంజూరు చేసినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్ 2025, మార్చి 25న లోక్సభలో తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాకు 221 మెగావాట్ల సామర్థ్యం ఉన్న, తూర్పుగోదావరి జిల్లాకు అత్యల్పంగా 9.33 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్సెట్లను కేటాయించినట్లు వెల్లడించారు.