భారతీయ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించింది.
వివరాలు:
పీఎం ఇంటర్న్షిప్-2024-25
అర్హతలు:
ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ ఉత్తర్ణుతో పాటు ఆన్లైన్/ దూరవిద్య ప్రోగ్రామ్లలో నమోదు చేసుకోవాలి.
కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు దాటకూడదు.
తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి అవకాశం లేదు.
వయోపరిమితి: 21-24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
శిక్షణ కాలం: 12 నెలలు.
శిక్షణ కేంద్రాలు: విశాఖపట్నం పరిసరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పీసీఎల్, బెల్, ప్రైవేటు సంస్థలు రెడ్డీస్, దివీస్ ల్యాబొరేటరీస్, టెక్ మహీంద్రా తదితర సంస్థలు.
ఎంపిక ప్రక్రియ: ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, ఇతర ప్రత్యేక కోర్సులు చేస్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-10-2024.
దరఖాస్తుదారుల జాబితా విడుదల: 26-10-2024.
ఎంపిక ప్రారంభం: అక్టోబరు 27 నుంచి నవంబరు 7 వరకు.
అభ్యర్థుల అంగీకారానికి గడువు: నవంబరు 15.
ఇంటర్న్షిప్ ప్రారంభం: 02-12-2024.