భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 266
వివరాలు:
1. జనరలిస్ట్: 170
2. డాక్టర్లు (ఎంబీబీఎస్): 14
3. లీగల్: 20
4. ఫైనాన్స్: 21
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20
6. ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, పీజీ, ఎల్ఎల్ఎం, ఎంకామ్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్/ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 21 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.50,925 - రూ.90,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్, 100 మార్కులు), మెయిన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ 250 + డెస్క్రిప్టివ్ 30 మార్కులు), ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 3 జూలై 2025.