దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి.
వివరాలు:
జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష- 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతుండాలి.
వయసు: 01.06.2008 నుంచి 31.07.2010 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో అయిదు విభాగాల్లో- మెంటల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), ఇంగ్లిష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సైన్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సోషల్ సైన్సెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో జేఎన్వీ అధికారిక వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-02-2025.
Website:https://cbseitms.nic.in/2024/nvsxi_11/?AspxAutoDetectCookieSupport=1
Apply online:https://cbseitms.nic.in/2024/nvsxi_11/