Published on Jan 12, 2026
Current Affairs
నళినీ జోషికి
నళినీ జోషికి

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్‌వేల్స్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ఆమెను వరించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త నళినీయే. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పూర్తిచేశారు. సిడ్నీలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.