Published on May 13, 2025
Current Affairs
నలుగురు సమాచార కమిషనర్ల నియామకం
నలుగురు సమాచార కమిషనర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2025, మే 12న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రభుత్వం పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్‌లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.