Published on Oct 23, 2025
Current Affairs
నీరజ్‌ చోప్రా
నీరజ్‌ చోప్రా

ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా గౌరవ హోదాను కల్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, అక్టోబరు 22న చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేశారు. చోప్రా 2016లో నాయబ్‌ సుబేదార్‌గా సైన్యంలో తన కెరీర్‌ను ఆరంభించాడు. 2016లో సుబేదార్‌గా, 2022లో సుబేదార్‌ మేజర్‌గా అతడికి పదోన్నతి లభించింది.