Published on Oct 16, 2024
Current Affairs
నోబెల్‌ పురస్కారం 2024 - ఆర్థికశాస్త్రం
నోబెల్‌ పురస్కారం 2024 - ఆర్థికశాస్త్రం

దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం 2024 లభించింది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన డారెన్‌ అసెమోగ్లు, సైమన్‌ జాన్సన్‌లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్‌ రాబిన్సన్‌లను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు 2024, అక్టోబరు 14న ‘రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ ప్రకటించింది. కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి..? కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడూ పేదరికంలో మగ్గుతున్నాయి..? అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనకు ఈ అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది.