దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం 2024 లభించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్లను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు 2024, అక్టోబరు 14న ‘రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ప్రకటించింది. కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి..? కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడూ పేదరికంలో మగ్గుతున్నాయి..? అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనకు ఈ అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది.