ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 2024, అక్టోబరు 2న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జాబితాలో బుమ్రా (870 పాయింట్లు) నంబర్వన్ ర్యాంకు సాధించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (869) రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (809) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.