Published on Feb 11, 2025
Current Affairs
నీతి ఆయోగ్‌ నివేదిక
నీతి ఆయోగ్‌ నివేదిక

2021-22కు సంబంధించి గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తిలో (జీఈఆర్‌) రాష్ట్రాల ప్రతిభపై నివేదికను 2025, ఫిబ్రవరి 10న నీతి ఆయోగ్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం, ఉన్నత విద్య ప్రవేశాల్లో తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిచి టాప్‌ 4లో నిలిచాయి.

ఆ తర్వాత ముందు వరుసలో (ఫ్రంట్‌ రన్నర్స్‌) ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, కర్ణాటక నిలిచాయి.

ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, ఝార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాలు అట్టడుగున్న నిలిచాయి.