Published on Dec 16, 2024
Current Affairs
నూతన పరాన్న కీటకం
నూతన పరాన్న కీటకం

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరిరంగన బెట్ట సమీపంలో నూతన పరాన్న కీటకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్కు చెందిన పరిశోధకులు ఏపీ రంజిత్, ప్రియదర్శిన్‌ ధర్మరాజన్‌ ఈ కీటకాన్ని గుర్తించామని తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ఈ కీటకాలు చీమలు, చెదలను తిని బతుకుతున్నట్లు గుర్తించామని తెలిపారు. కన్నడలో ‘కణజ హుళ’గా పిలుస్తున్న ఈ కీటకాలకు త్వరలో శాస్త్రీయనామం ఇచ్చేందుకు కీటక శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని వారు చెప్పారు.