నీళ్లలో పెరిగే పాచి (ఆల్గే)ని ఉపయోగించుకుని జీవ ఇంధనాన్ని ఉత్పత్తిచేసే ‘బయోలూప్’ సాంకేతికతను కర్ణాటకలోని బెళగావి విద్యార్థులు రూపొందించారు. ఈ ప్రాజెక్టును, బయోలూప్ పనితీరును దిల్లీలోని భారత్ మండపంలో మార్చి 10న నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ప్రదర్శించారు. స్టార్టప్ కర్ణాటక ఎన్ఏఐఎన్ 2.0 కింద ఈ ప్రాజెక్టు ఎంపికైంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకటించిన ‘కేస్ బుక్ ఆన్ రియల్ వరల్డ్ ఇంప్యాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎనర్జీ’లో బయోలూప్ వివరాలు ప్రచురించారు.
ఈ ఇంధనాన్ని వంటగ్యాస్గా, వాహనాలు, ఇతర యంత్రాలకు ఇంధనంగా వాడుకోవచ్చు.