Published on Sep 25, 2024
Current Affairs
నౌక నుంచి రోదసిలోకి రాకెట్‌ ప్రయోగం
నౌక నుంచి రోదసిలోకి రాకెట్‌ ప్రయోగం

చైనా సముద్రంలోని ఒక వేదిక నుంచి ఉపగ్రహ వాహకనౌక ద్వారా రోదసిలోకి విజయవంతంగా 8 శాటిలైట్లను పంపింది. షాండాంగ్‌ ప్రావిన్స్‌ తీరానికి చేరువలోని హైయాంగ్‌ సముద్ర వేదికపై నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇందులో జిలాంగ్‌-3 (స్మార్ట్‌ డ్రాగన్‌-3) రాకెట్‌ను ఉపయోగించారు. ఘన ఇంధనంతో పనిచేసే ఈ రాకెట్‌ను చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసింది.